టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి
సిరా న్యూస్,తిరుపతి;
సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు చేయుతనిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మీరంతా ఆదరించి మరోమారు గెలిపించాలని మహిళలను ఉద్దేశించి టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి విజ్ఞప్తి చేసారు. తిరుపతి భూపిరాట్టి మార్గంలో మంగళవారం జరిగిన నాల్గవ విడుత వై.ఎస్.ఆర్ చేయుత చెక్కుల పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ జగనన్న ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సామాజిక వర్గాల్లో 45-60 ఏళ్ళ మధ్య వయసున్న అక్కచెల్లెమ్మలకు ఆర్ధికంగా అండగా నిలబడేందుకు ఈ చేయుత పథకం ప్రారంభించారని, ప్రతి సంవత్సరం 18,750 రూపాయాల చొప్పున నాలుగేళ్ళ పాటు మొత్తం 75,000 ఆర్ధిక సాయం చేయడం జరిగిందన్నారు. 2 లక్షల 75 వేల కోట్లను అందించిన ఘనత జగనన్నదేనని, ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా నేను పేదోళ్ళ పక్షానే నిలబడతానని చెబుతూ బడ్జెట్ మొత్తం పేద ప్రజల అభివృద్ధికి ఖర్చు చేయడం జరిగిందన్నారు. అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతున్న జగనన్నకు మనమందరం అండగా వుండి రానున్న ఎన్నికల్లో జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని భూమన పిలుపునిచ్చారు. తిరుపతి ఇంతలా రోడ్ల విస్తరణతో, మాస్టర్ ప్లాన్ రోడ్లతో వుందంటె జగనన్న ఇచ్చిన స్వేచ్చేనని భూమన తెలిపారు. తిరుపతి మరింత అభివృద్దికి రానున్న ఎన్నికల్లో వైసిపి విజయానికి సహకరించాలని భూమన కరుణాకర రెడ్డి విజ్ఞప్తి చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ నవరత్న పథకాల ద్వారా పేద వారిని ఆదుకుంటూ, ముఖ్యంగా మహిళలకు అండగా వుంటున్న జగనన్నకు మరోసారి పట్టం కడితే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. తిరుపతి నగరంలో చేయుత పథకం క్రింద నాలుగు విడతాల ద్వారా 50.39 కోట్లు అక్కచెల్లెమ్మలకు అందినాయన్నారు. రానున్న కాలంలో వైసిపిని గెలిపించేందుకు మనమంతా కృషి చేద్దామన్నారు. డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న భూమన అభినయ్ రెడ్డిని తిరుపతి ఎమ్మెల్యేగా రానున్న ఎన్నికల్లో గెలిపించుకుందామన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తాజీన్, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, మెప్మా పిడి రాధమ్మ, మిషన్ మేనేజర్ కృష్ణవేణి, వైసిపి సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, నాయకులు ఉదయ్ వంశీ, మునిరామిరెడ్డి, మూలం అశోక్ కుమార్ రెడ్డి, దూది శివా, చింతా రమేష్ యాదవ్, లవ్లీ వెంకటేష్, దినేష్ రాయల్, సాయికుమారి, పుణిత, బౌతు ప్రమీలా తదితరులు పాల్గొన్నారు.