సిరా న్యూస్, బోథ్:
విద్యార్థులకు పరీక్ష అట్టల పంపిణీ
ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష అట్టలను ఉచితంగా పంపిణీ చేసారు. శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ మధుసూదన్, రిటైర్డ్ ఉపాధ్యాయులు లక్షీ్మనారాయణ చేతుల మీదుగా విద్యార్థులకు అట్టలు అందించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ… విద్యార్థులకు అవసరమైన పరీక్ష అట్టలను పంపిణీ చేసిన లక్ష్మీనారాయణ సేవలను కొనియాడారు. పదవి విరమణ పొందిన కూడ విద్యార్థుల కోసం పాటు పడటం అభినందనీయమని అన్నారు.