మాదిగలను అణిచివేస్తున్న రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి మోత్కుపల్లి
సిరా న్యూస్,పెద్దపల్లి;
మాదిగలను సీఎం రేవంత్ రెడ్డి అణిచివేస్తున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. మాదిగ శక్తి ఆద్వర్యంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధి సమావేశాన్ని పెద్దపల్లి అమర్ చంద్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. మాదిగ శక్తి సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ చింతకింది కాసిం, హై కోర్టు అడ్వకేట్ ఎస్. శరత్ కుమార్, తెలంగాణ ఉద్యమ కారులు, సీనియర్ పాత్రికేయులు తెలంగాణ విఠల్ హాజరై మాట్లాడారు. మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక్క మాదిగలనే కాకుండా బీసీలకు అందవలసిన రాజకీయ వాటాను దక్కకుండా చేస్తున్నాడని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ మాదిగలను విస్మరించాడని యావత్తు మాదిగలందరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ముఖ్య మంత్రి అయినంక 80 లక్షల జనాభా కలిగిన మాదిగ జాతిని రాజకీయంగా రేవంత్ రెడ్డి బొంద పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో మూడు ఎస్సీ రిజర్వడ్ స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా మాదిగలకు ఇవ్వలేదని, కేవలం వారి కులపోల్లకే అత్యధిక శాతం టిక్కెట్లను ఇచ్చి బిసిలకు అన్యాయం చేశారని అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మాదిగలకు అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందని, దీన్ని యావత్తు మాదిగలు మరచిపోరని మాదిగ శక్తి ద్వారా తెలంగాణ మాదిగలందరిని ఏకం చేస్తున్నామని, బాధ్యత సురేందర్ సన్నీదేనని నరసింహులు అన్నారు. ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ పెద్దపల్లిలో రెండు పోటీ సదస్సులు పెట్టడం వెనుక ఎవరి హస్థం ఉన్నదో మాదిగలు గ్రహించాలని, కలసి ఉండే మాదిగలను విడదీయడానికి రాజకీయ నాయకులు కుట్రలు చేస్తారని ఆ కుట్రలకు మాదిగలు బలి కావద్దని అన్నారు. ఇంకా ఎన్ని మీటింగులు పెట్టైనా సరే పెద్దపల్లి మాదిగలందరినే కాకుండా రెండు రాష్ట్రాల మాదిగలను ఏకం చేయవలసిన బాధ్యత సురేందర్ మాదిగదన్నారు. విఠల్ మాట్లాడుతూ రాష్ట్రంలో మాదిగలకు రాజకీయంగా జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తవలసిన అవసరం ఉన్నదని అన్నారు. కేసీఆర్ మోసం చేసిండనే మాదిగలందరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలను అన్యాయం చేశాడని, మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాదిగ జాతికి ఒక్క టిక్కెట్టు ఇవ్వకుండా ఒక్క మాదిగను కూడా పార్లమెంటుకు పోకుండా చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందని ఆరోపించారు. మేమెప్పుడూ మాదిగల పక్షాన నిలబడతామని కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి తప్పకుండా పడుతుందని అన్నారు. హై కోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మాదిగలకు న్యాయంగా దక్కవలసిన రాజకీయ రిజర్వేషన్లను వెంకటస్వామి కుటుంబమే తన్నుకు పోతొందని, దీనికి రేవంత్ రెడ్డి సహకరించారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాదిగ శక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినపాటీ రజిని, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కల్లేపల్లి రవి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నాగుల కిరణ్ బాబు, నియోజక వర్గ అద్యక్షులు తాళ్ళపెల్లి అంజయ్య, నాయకులు కొమ్ము ప్రవీణ్ బాబు, మడిపెల్లి మొగిలి, బోటుకు రమేష్ బాబు, అక్క పాక తిరుపతి, డాక్టర్ శరత్ బాబు, వివేక్ పటేల్, తాళ్ళ పెల్లి రమేష్, బానోత్ సంజీవ్ నాయక్, మీసాల సాయిలు, దీపక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *