ఏప్రిల్ 25 నుంచి రీవెరిఫికేషన్

 సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్ లో 60.01 మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ లో 64.19 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాలలో ఈసారి కూడా బాలికలు పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి అగ్రస్థానంలో నిలవగా, సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా విద్యార్థులు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందకూడదని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు. మే 24వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *