రైల్వే అధికారులతో ఎంపి ఈటల సమీక్ష

సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ రైల్వే స్టేషన్ అర్ యు బి పనులను రైల్వే ఉన్నత అధికారులతో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడారు నరేంద్ర మోడీ హయాంలో తెలంగాణ రాష్ట్రం రెండు వేల కోట్లకు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టారు చెప్పారు. మేడ్చల్ రైల్వేస్టేషన్లో 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. గౌడవెల్లి గుండ్ల పోచంపల్లి అల్వాల్ బొల్లారం అమ్మ గూడా రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారన్నారు. మెట్రో రైల్ మాదిరిగానే ఎంఎంటిఎస్ రైలు కూడా దగ్గర స్టేషన్లో ఏర్పాటు చేయమని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ప్రజలు కోరుతున్న ప్రతి సమస్య ఢిల్లీ కి తీసుకపోయి వీళ్లంతా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు . మరో 20 సంవత్సరాలు ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకోండి అండర్ పాస్ పనులను అభివృద్ధి చేశామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *