సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆర్ఎంపీల సేవలను గుర్తించడం హర్షణీయం
* ఆర్ఎంపీ అసోసియేషన్ అదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కావటి రమేష్ యాదవ్
రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంపీ, పీఎంపీల సేవలను గుర్తించడం హర్షణీయమని తెలంగాణ ఆర్ఎంపీ అసోసియేషన్ అదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కావటి రమేష్ యాదవ్ అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత రెడ్డి ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వాలని అనడం, సర్టిఫికెట్లు అందించేందుకు సాధ్య సాధ్యాలు పరిశీలించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం శుభ పరిణామన్నారు. ఈసందర్బంగా తెలంగాణ ఆర్ఎంపీ అసోసియేషన్ అదిలాబాద్ జిల్లా తరఫున సీఎం, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు రామోజీ వీరాచారి, ప్రధాన కార్యదర్శి రాళ్ల బండి శంకర్, తెలంగాణ ఆర్ఎంపీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.