RMP PMP Pedavena Raju: ఈనెల 29 నుంచి గ్రామాల్లో వైద్య‌ సేవలు బంద్ : ఆర్ఎంపీ పీఎంపీ మండ‌ల అధ్యక్షుడు పెదవేన రాజు

సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
ఈనెల 29 నుంచి గ్రామాల్లో వైద్య‌ సేవలు బంద్ : ఆర్ఎంపీ పీఎంపీ మండ‌ల అధ్యక్షుడు పెదవేన రాజు

ఆర్ఎంపీ, పీఎంపీ లపై టీఎస్ఎంసీ దాడులకు నిరసనగా ఈనెల 29 నుంచి గ్రామాల్ల‌లో ఆర్ఎంపీ ,పీఎంపీ వైద్య సేవలు బంద్ చేస్తున్నట్లు ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం మండల అధ్యక్షుడు పెదవేన రాజు తెలిపారు. బుధ‌వారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.ఈనెల‌ 29 గురువారం ఉదయం 11 గంటలకు పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం వద్దకు ఆర్ఎంపీలు అండ్ పిఎంపీలు హాజరు కావాలన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు . గ్రామాల్లో ఏళ్లుగా కొనసాగిస్తున్న వృత్తిని అర్ధాంతంగా మూసివేయడం వలన ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.దీనికి ప్రజలందరూ సహకరించగలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎంపీ, పీఎంపీల నాయకులు జనగామ రవి, భోల్లోజుల రవీందర్, సురేందర్ కుమార్, మహేందర్, నవీన్, భాస్కర్, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *