రామచర్లపాడు వద్ద జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం

ఒకరు మృతి
సిరా న్యూస్,నెల్లూరు;
కొడవలూరు మండలం రామచర్లపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కె శ్రీ కార్గో కంటైనర్ ఆగి ఉన్న లారీని వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డైవర్ లక్ష్మణరావుకు కాలికి తీవ్ర గాయాలు కాగా, పక్కనే ఉన్న వ్యక్తి కొండేటి రవి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి విజయవాడకు చెందిన వారు గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని హైవే అంబులెన్స్ ద్వారా హైవే మొబైల్ సిబ్బంది వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కొడవలూరు ఎస్సై కోమటిరెడ్డి కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *