సిరా న్యూస్,పెద్దపల్లి;
ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో పెద్దపల్లి ట్రాఫిక్ సివిల్ పోలీస్ ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పద్ధతుల పైన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ సత్యనారాయ ణ, పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ లక్ష్మణరావు, ఎస్సై 2 మల్లేష్ యాదవ్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ రోడ్డు భద్రత పాటిస్తే కనుక యాక్సిడెంట్స్ ని నిర్మూలించవచ్చు అని ఇతర దేశాలతో పోలిస్తే మన భారతదేశం రోడ్ యాక్సిడెంట్లు ముందు వరుసలో ఉందని దానిని అరికట్టడానికి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ తప్పనిసరిగా పాటించాలని హెల్మెట్ ధరించి వాహనం ఎక్కాలని అదేవిధంగా ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎస్సై లక్ష్మణరావు మాట్లాడుతూ డ్రగ్స్ పైన అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడున్న తరుణంలో విద్యార్థులు వ్యసనాలకు లోనై డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారని తద్వారా వారి యొక్క జీవితాన్ని కోల్పోతున్నారని సంఘంలో జరుగుతున్న డ్రగ్స్ ని అరికట్టడం కోసం విద్యార్థులలో అవగాహన కల్పిస్తున్నామని చుట్టుప్రక్కల ఇలాంటి డ్రగ్స్ కార్య క్రమాలు తమ దృష్టికి వస్తే గనక పోలీసువారి దృష్టికి తీసుకుని రావాలని వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. పెద్దపల్లి ఎస్ఐ 2 మల్లేష్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం జరిగింది విద్యార్థులు సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్ ట్విట్టర్ స్నాప్షాట్ వంటి సోషల్ మీడియా ఉపయోగిస్తూ చెడు వ్యసనాలకు లోన్ అవుతున్నారని సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలి కానీ చెడు కార్యక్రమాలకు ఉపయోగించకూడదని అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఎం ఆధార్ డౌన్లోడ్ చేసుకోవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమీ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేష్, ఎంబీఏ హెచ్ ఓ డి ఆరిఫ్, డిప్లమా ఇంచార్జ్ చొప్పరి వంశీ పాల్గొన్నారు.