సిరా న్యూస్, బేల
మహిళకు రక్తదానం చేసిన రోహిత్
* సామ రూపేష్ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యలు
రక్తహీనతతో బాధపడుతూ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళకు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం అవసరమైన రక్తాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మాంగ్రూడ్ గ్రామానికి చెందిన టేకం రత్నమాల అనే మహిళ రక్తహీనతతో బాధపడుతూ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెకు 6.6 గ్రామ్స్ రక్తం ఉండడంతో ఆమెకు అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డిని సంప్రదించారు. వెంటనే ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్ నగర్ కాలనీకి చెందిన రోహిత్ మానవత్వంతో వెంటనే స్పందించి రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు రక్తం అందించారు. ఈసందర్బంగా బాధితుల కుటుంబ సభ్యులు టేకం శ్రీరామ్ సామ రూపేష్ రెడ్డికి రక్తం ఇచ్చిన రోహిత్ కు కృతజ్ఞతలు తెలపారు.ఆయన వెంట జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాగరాజు తదితరులు ఉన్నారు.