శానిటరీ వర్కర్లను దూరంగా ఉండి సెల్ఫీలు తీసుకోమన్న రోజా

తమిళనాడులోని తిరుచందూర్ లో ఘటన
తమిళనాట వీడియో వైరల్…
రోజాపై తీవ్ర విమర్శలు చేస్తున్న నెటిజన్స్
 సిరా న్యూస్,తిరుపతి;
తమిళనాడు తిరుచెందూర్లోని ప్రసిద్ధి చెందిన సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడి మాస అభిషేకం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో నటి, మాజీ మంత్రి రోజా తన భర్త, దర్శకుడు ఆర్కే సెల్వమణితో కలిసి నిన్న ఆలయాన్ని సందర్శించారు. అలాగే స్వామి దర్శనం ముగించుకుని బయటకు రాగానే పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ సిబ్బంది నటి రోజాను సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ సమయంలో ఆలయంలో పనిచేస్తున్న ఇద్దరు ప్రైవేట్ క్లీనింగ్ వర్కర్లు గా పని చేస్తున్న మహిళలు ఆశగా ఫోటో దిగాలని నటి రోజా వద్దకు వెళ్లగా, నటి రోజా వాళ్లను దూరంగా ఉండమని చెప్పింది. ఇప్పుడీ వీడియో ఫుటేజ్ వైరల్గా మారడంతో పాటు నటి రోజా స్వచ్ఛ్ కార్మికులను దూరంగా ఉండమని చెబుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి మరియు అంటరానితనాన్ని కొనసాగిస్తూ నటి రోజా స్వచ్ఛ్ కార్మికులను పక్కన పెడుతున్న దృశ్యాలు పలువురిని ఆలోచింపజేస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *