సిరాన్యూస్,కాల్వ శ్రీరాంపూర్
రాఖీలు కట్టిన ఆర్ఎస్ఎస్ నాయకులు పురుషోత్తం
అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళ మధ్య ఆప్యాయతను అనురాగాన్ని పెంపొందించేది రక్షాబంధన్ అని ఆర్ఎస్ఎస్ నాయకులు పురుషోత్తం అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా మండలంలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం కేంద్రం లో అర్ఎస్ ఎస్ కార్యకర్తలు దుకాణం దారులకు, యువకులకు రాఖీలు కడుతూ రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోదర భావాన్ని పెంపొందించడానికి హిందూ పండుగలో రాఖి పండుగను చెప్పుకుంటామని తెలిపారు. రాఖీ పండుగ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు రమేష్ రవి పాల్గొన్నారు.