సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
బస్సు షెల్టర్ లేక ప్రయాణికుల అవస్థలు…
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బస్సు షెల్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆర్టీసీ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మండుటెండలో రహదారిపై నిరీక్షిస్తున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య పెరిగింది. బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఎండ వేడిమికి తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్లో నిర్మల్ వెళ్లే వాళ్లకు నిర్మల్ నుండి వచ్చే వారికి అవసరంగా విద్యానగర్లో ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. దాని చుట్టూరు గద్దర్ కట్టి ఉంచారు అలా గడిచిపోయింది . కానీ ఇప్పుడు రోడ్డు వెడల్పు కారణంగా ఏమీ లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పాలు పడుతున్నారు. ఈ మండుటెండలో అక్కడ నిలబడి ఏం చేద్దామని ఇక్కడినుండి బస్టాండ్ కి వెళ్తున్నారు. ఆటోలో లోకల్ చార్జ్ 30 రూపాయలు వెచ్చించి మరీ వెళ్తున్నారు. ఎండలో నిలబడలేక 40 రూపాయలకు నిర్మల్ వెళ్లొచ్చు అలాంటిది. విద్యానగర్ నుండి బస్టాండ్ కు 30 రూపాయలు వెచ్చించి బస్టాండ్ కు వెళ్లి వారి చోటికి చేరుకుంటున్నారు. దయచేసి నాయకులు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.