మహిళకు గాయాలు
సిరా న్యూస్,గుంటూరు;
నగరంలోని చుట్టుగుంట కూడలి ఎస్బీఐ బ్యాంక్ ఎదుట చిలకలూరిపేట వైపు నుంచి గుంటూరు వస్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం బైకను ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న కోటమ్మ అనే మహిళ కాలుకు తీవ్ర గాయం అయింది. ఆమె బైక్పై వస్తూ చుట్టుగుంట సెంటర్ను దాటే ప్రయత్నం చేస్తోంది.
అదే సమయంలో వేగంగా వస్తున్న అద్దంకి డిపో బస్సు ఢీకొంది. ట్రాఫిక్ వెస్ట్ సీఐ శ్రీనివాసరావు సంఘటనపై విచారణ చేపట్టారు.