Rupesh Reddy: కాంగ్రెస్ తోనే ఆదివాసుల సమస్యలు పరిష్కారం

సిరాన్యూస్‌, బేల‌
కాంగ్రెస్ తోనే ఆదివాసుల సమస్యలు పరిష్కారం
* యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి
* ఖార గ్రామంలో సమస్యల పరిశీలన
* సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలి

ఆదివాసుల సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నేడు వారి సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పరిష్కారం అవుతాయని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రుపేష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలంలో గల అనేక గ్రామాల్లో ఆదివాసులు నివసిస్తున్న వారి సమస్యలను పరిష్కరించడంలో అప్పటి నాయకులు నిర్లక్ష్యం చేశారని తెలిపారు. శనివారం బేల మండలంలోని ఖార గ్రామానికి వెళ్లిన సామ రూపేష్ రెడ్డి స్థానిక ఆదివాసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు.రాబోయే రోజుల్లో ఆదివాసీ ముద్దుబిడ్డ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణక్క కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు.త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అన్నారు. ఆయనతో పాటు మాజీ సర్పంచ్ మోహన్, శ్యామ్ రావు, నాగారావు, గ్రామస్తులు గ్రామ పటేల్ మనోహర్, మాడవి సీతారాం, భీమ్రావు, మాడవి లక్ష్మణ్, జంగు, గంగారం తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *