సిరా న్యూస్,రామడుగు;
భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కర్ణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఎకరాకు 25 వేల రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులకు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా 500 రూపాయలు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పసల్ బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలనువెంటనే మొదలుపెట్టి తాలు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఒంటెల కర్ణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ జిన్నారం విద్యాసాగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు పొన్నం శ్రీనివాస్ గౌడ్ దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోలపురి రమేష్ తిరుమలాపూర్ ఎంపీటీసీ సభ్యులు మోడీ రవీందర్ మండల ప్రధాన కార్యదర్శులు పోచంపల్లి నరేష్ పూరెల్ల శ్రీకాంత్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు కళ్లెం శివ యువమోర్చా మండల ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్ ఓబీసీ మోర్చా మండల ఉపాధ్యక్షులు బక్క శెట్టి శ్రీకాంత్ బూత్ కమిటీ అధ్యక్షులు సింగసాని మల్లేశం సిరిపురం శంకర్ గోపు అనంతరెడ్డి పొన్నం అభిషేక్ వేముల శ్రీకాంత్ పాదం సాగర్ అనంతల తిరుపతి బుర్ర వినయ్, కొల్లూరి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
=====================