సిరా న్యూస్ కుందుర్పి
రౌడీషీటర్ హత్యకేసును ఛేదించిన పోలీసులు
*ఐదుగురు అరెస్టు….మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
*వివరాలు వెల్లడించిన అనంతపురం ఒన్ టౌన్ పోలీసులు
అనంతపురంలో మంగళవారం జరిగిన రౌడీషీటర్ సయ్యద్ జిలాన్ కుక్కల జిలాన్ (33) హత్య కేసును 24 గంటలలోపే పోలీసులు ఛేదించారు. బుధవారం ఒన్ టౌన్ పోలీసులు జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు వివరాలు వెల్లడించారు. ఒన్ టౌన్ సి.ఐ రెడ్డెప్ప , సిబ్బంది ఐదుగురు నిందితులను ఈ కేసులో అరెస్టు చేశారని, అలాగే మూడు ద్విచక్ర వాహనాల స్వాధీనం స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల వివరాలు పండ్యాల ప్రసాద్(42), రాణినగర్, అనంతపురంనరేష్, (36), రాణి నగర్ అనంతపురం ఎల్లప్ప (41) ఎల్బీ కాలనీ, బుక్కరాయ సముద్రం మండలంప్రతాప్, వయస్సు 25 సం.లు, రాణి నగర్, అనంతపురం సువర్ణ (30) రాణి నగర్, అనంతపురం 2021 సంవత్సరంలో స్థానిక శ్రీకృష్ణదేవరాయ నగర్ లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్న సయ్యద్ జిలాన్ కుక్కల జిలాన్ పై అనంతపురం ఒన్ టౌన్ పోలీసు స్టేషన్లో రౌడీషీట్ ప్రస్తుతం. అరెస్టయిన నిందితుల్లో ప్రసాద్, నరేష్ లతో కలసి బేల్దారి పనులు చేసిన సయ్యద్ జిలాన్ కుక్కల జిలా న్ఆ సందర్భంగా తలెత్తిన బేల్దారి పనుల డబ్బుల విషయంలో ఇప్పటికీ ప్రసాద్, నరేష్ లతో గొడవపడుతున్న తెలిపారు.