సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడలోని విద్యుత్ కాలనీలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాలను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి హాస్టల్లో అందిస్తున్న భోజనం,హాస్టల్లోని మౌలిక సదుపాయాల ఎలా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.హాస్టల్ పరిసరాలను భోజనశాల,వంట గదులను మంత్రి పరిశీలించారు. పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.భోజనశాల, వంట గదులను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు.అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.ఆహార పదార్దాల నాణ్యతపైని అరా తీశారు.విద్యార్థులు నిద్రించే రూములు వారు ఉపయోగించే మరుగు దోడ్లు పరిశుభ్రంగా లేకపోవడంతో వార్డెన్ ను మంత్రి సవిత మందలించారు.ఆహార పదార్థాల నాణ్యత, పరిమాణంపై విద్యార్థులను నేరుగా ఆడిగి తెల్సుకున్నారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత లేకపోవడంతో పైనా ఆగ్రహం వ్యక్తం చేసారు. పద్ధతి మార్చుకోవాలని వార్డెన్ ను మంత్రి హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో మంత్రి సవిత మాట్లాడుతూ అందరూ బాగా చదువుకుని ఉన్న స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.తదుపరి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. వసతి గృహాంలో ఏ సమస్య ఉన్న నేరుగా తనకు ఫోన్ చేయమని విద్యార్థులకు మంత్రి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
========