Sabarimata:భక్తిశ్రద్ధలతో శబరిమాత పల్లకి ఊరేగింపు

సిరా న్యూస్, బోథ్
భక్తిశ్రద్ధలతో శబరిమాత పల్లకి ఊరేగింపు
* భ‌క్తుల‌కు అన్న‌దానం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలో గురువారం శబరిమాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామంలో శబరిమాత పల్లకి ఊరేగింపు నిర్వహించారు. మూడు రోజులపాటు జరిగే కార్యక్రమంలో శబరిమత విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించనున్నట్లు ఆశ్రమ భక్త బృందం వారు తెలిపారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించిన భక్తులు రామనామ సంకీర్తన చేస్తూ భజన కార్యక్రమాలు చేశారు. రాత్రిపూట ఆశ్రమంలో వివిధ గ్రామాల భజన బృందాల వారు భజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆశ్రమ కమిటీ వారు తెలిపారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. గ్రామస్తులకు భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *