సిరాన్యూస్,జైనథ్
పోషకాహారాన్ని తీసుకోవాలి
జిల్లా స్త్రీ శిశు సంక్షేమ , వయోవృద్ధుల అధికారి సబిత
పోషణ పక్షం పై అవగాహన
జైనథ్ ప్రాజెక్టు సెక్టార్ మేడిగూడ గ్రామంలో పోషణ పక్షం నిర్వహించారు. బుధవారము పోషణ పక్షంలో భాగంగా పోషణ్ బి, పడాయి బి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ , వయోవృద్ధుల అధికారి సబిత హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రీ స్కూల్ తల్లులకు కాలనీవాసులకు బాల్య సంరక్షణ విద్య ప్రాంతీయ సాంప్రదాయక ఆహార పద్ధతులు పోషకాహారం పై తల్లులకు వివరించారు. అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించే ప్రీ స్కూల్ కార్యక్రమాల్లో పిల్లలను భాగాస్వామ్యం చేయడం ద్వారా వారు శారీరకంగా మానసికంగా, సామాజికంగా, భాషాపరంగా అభివృద్ధి చెందుతూ బడికి సంసిద్ధులు అవ్వడానికి దోహదపడుతుందని తెలిపారు.గర్భిణీ సమయం నుంచి పిల్లలకు రెండు సంవత్సరాల వరకు గల వెయ్యి రోజుల కాలవ్యవధిలో తీసుకోవలసిన పోషకాహారం రక్తహీనత నివారించే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం గురించి అవి తీసుకునే విధానం గురించి గర్భిణీలకు తల్లులకు కిశోర బాలికలకు పూర్తి అవగాహన కల్పించారు.అలాగే ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ నరసమ్మ మాట్లాడుతూ పోషకాహారాన్ని అందించే దిశగా అంగన్వాడీ టీచర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఎల్లవేళలా పనిచేస్తుందని తెలియజేస్తూ పోషకాహారాన్ని పొందుతున్నారని నిర్ధారించడానికి భారత ప్రభుత్వం చే నిర్వహించబడే పోషణం పక్షం ఇది ప్రధానంగా గర్భిణీ లు తల్లిపాలు ఇస్తున్న తల్లులు, ఆరేళ్లలోపు పిల్లలకు పోషకాహారాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది.ఈ 15 రోజుల వేడుక పోషకాహారం ఆహార పద్ధతులు, మహిళల ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం దీని ఉద్దేశమని వివరించడం జరిగింది.అలాగే ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత జెండర్ స్పెషలిస్ట్ కృష్ణవేణి పాల్గొని బేటి బచావో బేటి పడావో పథకం ముఖ్య ఉద్దేశం మహిళల హక్కులు మహిళా చట్టాలు మహిళలకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ మరియు మహిళా సాధికారత ఉద్దేశం గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అన్నపూర్ణ అంగన్వాడీ టీచర్లు ,మహిళలో గర్భిణీలు కిశోర బాలికలు, మహిళా సాధికారత జెండర్ స్పెషలిస్ట్ కోటేశ్వర్, ఆర్థిక అక్షరాస్యత నిపుణుడు నిఖిలేశ్వర్ ,స్కూల్ యాజమాన్యం పాల్గొనడం జరిగింది.