సిరాన్యూస్,ఓదెల
జూలై 14న పెద్దపట్న మహోత్సవం : ఆలయ ఈవో సదయ్య
పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈనెల 14న పెద్దపట్న మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సదయ్య తెలిపారు. ఈ దేవస్థానంలో ఉగాది పండుగ నుండి మొదలుకొని మూడు నెలల పాటు వేలాది భక్తులతో ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. శ్రీ కోది నామ సంవత్సర ఆషాడ శుద్ధ అష్టమి జులై 14 ఆదివారం ఉదయం 9 నుండి గణపతి పూజ పుణ్యాహ వచనము, మంటప స్థాపన శ్రీ వీరభద్రారాదన, రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ భద్రకాళి ఆవాహన, రాత్రి పది గంటల నుండి అగ్నిగుండ ప్రజ్వలన, పెద్దపట్నం నిర్వహించనున్నట్లు తెలిపారు. 15 జూలై ఉదయం ఐదు గంటలకు భక్తులు అగ్నిగుండం దాటుట ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.