Sadashaya Foundation: ఇద్దరి అంధులకు చూపునిచ్చిన నేత్రదాత నంది శంకరయ్య

సిరాన్యూస్‌, ఓదెల
ఇద్దరి అంధులకు చూపునిచ్చిన నేత్రదాత నంది శంకరయ్య

ఓదెలకు చెందిన‌ నివాసి నంది శంకరయ్య మృతి చెందగా ఆయన నేత్రాలను దానం చేస్తే, ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించవచ్చని సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి  డాక్టర్ భీష్మాచారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించగా, ఎల్‌వీపీ గోదావరి ఖని టెక్నీషియన్ రాజన్న ద్వారా నేత్రాలను సేకరించి , హైదరాబాద్ ఐ బ్యాంక్ కు పంపించారు. కుటుంబం దుఃఖంలో ఉండి కూడా మరో ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించుట కు ముందుకు వచ్చిన కుమారులు కోడండ్లు, రవి సునీత, శివకుమార్ వినీష్, కూతుర్లు అల్లుండ్లు అరుణ శ్రీనివాస్, కవిత మల్లేశంలకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సహకరించిన క్యాతం వెంకటేశ్వర్లకు సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు టి.శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి,రమేష్, రామకృష్ణా రెడ్డి, రాజమౌళి, చంద్రమౌళి, బీమనపల్లి పృత్విరాజ్ ,వాసు,,సారంగం,డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ వేణు,క్యాతం మల్లేశం అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *