Sadashiv: కొత్తపల్లిలో కార్గో కేంద్రం ప్రారంభం: మేనేజర్ సదాశివ్

సిరాన్యూస్‌, ఓదెల
కొత్తపల్లిలో కార్గో కేంద్రం ప్రారంభం: మేనేజర్ సదాశివ్

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ పరిసర ప్రాంత వ్యాపారస్థుల, ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కొత్తపల్లి గ్రామ కేంద్రంలో కార్గో కేంద్రాన్నికరీంనగర్ మేనేజర్ సదాశివ్ ఎగ్జిక్యూటివ్ చంద్రమౌళి తో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా పార్సల్ కొరియర్ సర్వీస్ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో పలు పట్టణాల్లో అందుబాటులో ఉందని తెలిపారు. అన్ని పట్టణాల్లో పార్సల్లు ,కొరియర్ కవర్లు తక్కువ చార్జీతో వేగంగా రవాణా చేస్తార,ని ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల‌ని తెలిపారు. కార్యక్రమంలో ఏజెంట్ జోంగోని వెంకటేష్, రమేష్, శ్రీనివాస్, కొమురయ్య, మహేష్, రాజేష్, వినయ్, సాయి, నాగవర్మ, అభిలాష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. వివరాలకు ఏజెంట్ జోంగోని వెంకటేష్ 7981169996, హుజురాబాద్ డిపో కార్గో ఎక్యూజిటివ్ సెల్. 9154298559 సంప్ర‌దించాల‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *