సిరా న్యూస్,నల్గోండ;
నల్లగొండ జిల్లా పరిధిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి మళ్ళీ ప్రారంభమైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను, ప్రస్తుతం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉంది. అలాగే సాగర్ డ్యాం పూర్తి నీటి సామర్థ్యం 312 టిఎంసిలుగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 1 లక్షా 70 వేల 946 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 1 లక్షా 29 వేల 446 క్యూసెక్కుల నీరు.. క్రస్ట్ గేట్స్, విధ్యుత్ ఉత్పత్తి, కుడి – ఎడమ కాలువలకు, హైదారాబాద్ నగరానికి తాగునీరు కోసం ఔట్ ఫ్లో రూపంలో వెళ్తుంది. కృష్ణా బేసిన్ ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండ మాదిరిగా ఉండటంతో వచ్చే వరద అంతా యధావిధిగా దిగువకు వదులుతున్నారు.