సిరా న్యూస్,భీమదేవరపల్లి
హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి
* ఎస్సై సాయి బాబు
ఎన్నికల కోడ్ అమలులో వున్నా నేపథ్యంలో హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ ఎస్సై నండ్రు సాయిబాబు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించిన, రోడ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ అల్లర్లు చేసిన కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మండలంలో తిరిగే వాహనాలపై గాని, జనాలపై గాని రంగులు చల్లకూడదని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని శాంతి భద్రతలకు సహకరించాలని తెలిపారు.