Sai Charana: విద్యుత్ షాక్‌తో ప్లంబర్ సాయి చ‌ర‌ణ మృతి

సిరాన్యూస్‌, బోథ్‌
విద్యుత్ షాక్‌తో ప్లంబర్ సాయి చ‌ర‌ణ మృతి

విద్యుత్ షాక్‌తో ప్లంబర్ మృతి చెందిన సంఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ‌లంలోని పొచ్చెర గ్రామంలో చోటు చేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. బోథ్ మండలంలోని పొచ్చర గ్రామానికి చెందిన సాయి చరణ్ (22) యువ‌కుడు ఉదయం పూట ఇంటి నుండి వెళ్లిన ఈయన గ్రామంలోని గ్రామంలోని పాఠశాలకు పైప్‌ లైన్ కోసం మంచినీటి ట్యాంక్‌కు కనెక్షన్ ఇచ్చేందుకు పాఠశాలలో ఉన్న మరుగుదొడ్డి పైకి ఎక్కారు. ఇదే క్రమంలో పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో మరుగుదొడ్డి పైకప్పు పై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుటుంబానికి ఆసరాగా ఉంటూ ప్లంబర్ పనులు చేస్తున్న ఈయన మృతి చెందడంతో గ్రామస్తులు శోకసముద్రంలో మునిగిపోయారు. అందరితో కలుపుగోలుగా ఉండే ఈయన మృతి మిత్ర బృందంలో తీరని విషాదం నింపింది. అయితే ఇంటికి పెద్ద వాడైన ఈయన మృతి వల్ల కుటుంబం పెద్ద కోల్పోయిన‌ట్లు అయింది. కాగా పాఠశాల నుండి వెళుతున్న 11 కెవి విద్యుత్ తీగలను తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.ఈవిషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవ పంచనామ నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి రామ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *