సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
సుభాష్ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
* సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* ఖానాపూర్ సీఐ సైదారావు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్నగర్ కాలనీలో శుక్రవారం ఖానాపూర్ సిఐ సైదారావు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగాం నిర్వహించారు. ఇందులో భాగంగా కాలనీలో ప్రతిఇళ్లలో సోదాలు నిర్వహించి సరైన అనుమతి పత్రాలు లేని 41 ద్విచక్ర వాహనాలు, 7 ఆటోలను, మూడు కార్లను సీజ్ చేశారు. సరియైన ధ్రువపత్రములు లేని వాహనములకు చలన్ విధించడం జరిగింది. ఈ సందర్భంగా ఖానాపూర్ సిఐ సైదారావు మాట్లాడుతూ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు తమ కాలనీలో వచ్చినచో పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే డయల్ 100 సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఖానాపూర్ ఎస్సై , కడెం దస్తురాబాద్, పెంబి
ఎస్సై , సిబ్బంది పాల్గొన్నారు.