సిరా న్యూస్, సైదాపూర్
సైదాపూర్లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
వెన్కేపల్లి, సైదాపూర్ మండల కేంద్రంలో మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్ మాట్లాడుతూ ఐటి రంగ అభివృద్ధికి, దేశ సాంకేతిక రంగానికి రాజీవ్ గాంధీ బాటలు వేసారని తెలిపారు. దేశ ప్రధానిగా మన భారతదేశానికి ఎన్నో గుర్తింపులు, మరెన్నో సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, వివిధ గ్రామాల యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.