సిరాన్యూస్, బేల
సైదాపూర్లో భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్య
భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సైదాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బేల మండల పరిధిలోని సైదాపూర్ గ్రామంలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో ఇద్దరి మధ్య కొన్నాళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే తాజాగా సోమవారం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన భర్త కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడు. అనంతరం అతడు కూడా గొంతు కోసుకుని ప్రణాలు విడిచాడు. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.