సిరాన్యూస్, సైదాపూర్:
ఎస్సై తిరుపతిని కలిసిన కాంగ్రెస్ మండల యువజన నాయకులు
సైదాపూర్ మండల నూతన ఎస్సైగా సిహెచ్.తిరుపతి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల యువజన నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్సైను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రఘు యాదవ్, మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ అజయ్, గ్రామశాఖ అధ్యక్షులు రాజేష్, శ్రీనివాస్, రాహుల్ రెడ్డి, శ్రావణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.