హైదరాబాద్ ట్రైనీ ఐఏఎస్ లకు సజ్జనార్ అవగాహన

సిరా న్యూస్,హైదరాబాద్;

తెలంగాణ కేడర్కి చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్లు శుక్రవారం హైదరాబాద్ లోని బస్ భవన్ ను సందర్శించారు. టీజీఎస్ ఆర్టీసీ అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను వారు అధ్యయనం చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సంస్థ ఉన్నతాధికారులతో
కలిసి సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆర్టీసీ పనితీరు, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మీ పథకంఅమలుపై వివరాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *