Salendar Sivaiah: ముఖ్యమంత్రికి ముదిరాజుల కృతజ్ఞతలు

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
ముఖ్యమంత్రికి ముదిరాజుల కృతజ్ఞతలు
* ముదిరాజుల‌ను బీసీ ఏ లోకి మార్చాలి
* రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేందర్ శివయ్య ముదిరాజ్
రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగి రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిన ముదిరాజుల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజుల పట్ల ప్రత్యేక చొరవ చూపి ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ క్యాబినెట్లో తీర్మానించడాన్ని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేందర్ శివయ్య ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొజ్జ నారాయణ ముదిరాజ్ ,పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దారవెని రాము ముదిరాజ్, దార్శరవి ముదిరాజ్ కోశాధి కారి బొజ్జ,సంతోష్ తదితరులు స్వాగతించారు. బుధ‌వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్, మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ముదిరాజ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా ముదిరాజులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తగు ప్రాధాన్యంతమిచ్చి ముందుగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ తీర్మానించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అదే తరహాలో గత నాలుగు ఐదు దశాబ్దాలుగా ముదిరాజులను బిసి-డి నుండి బీసీఏలోకి మార్చే అంశం మరుగున పడి ఉందని ఉందని అన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ తో పాటు బీసీఏ సాధన కోసం 2016 డిసెంబర్ 2 నుండి 18 వరకు సుమారు 450 కిలోమీటర్ల మీద సుమారు 1000 మంది యువకులు ఆదిలాబాద్ భీమన్న పాదాల నుంచి నిజాం కాలేజ్ గ్రౌండ్ వరకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 2009లో జీవో నెంబర్ 15 ప్రకారం ముదిరాజులను బిసి ఏలోకి చేర్చినప్పటికీ ఆ తర్వాత కొందరు దీనిపై హైకోర్టుకు వెళ్లగా ముదిరాజులు సుప్రీంకోర్టుకు వెళ్లి 12 సంవత్సరాల పాటు సాగించిన పోరాట ఫలితంగా మళ్లీ సుప్రీంకోర్టు బీసీ కమిషన్ కు ఈ అంశాన్ని పరిష్కరించాలని సూచించినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తమ సమస్య ఇంతవరకు ఇలాంటి పరిష్కారానికి నోచుకో లేదని ముదిరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా విద్యా ఉపాధి అవకాశాలలో ముదిరాజ్ యూత్ యువకులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించి జీవో నెంబర్ 15 అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు .అదేవిధంగా రాష్ట్ర క్యాబినెట్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజ్ కు క్యాబినెట్లో కి తీసుకొని తగు విధమైన హోదా కల్పించాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేసిన ముదిరాజ్ కార్పొరేషన్ కు తగిన విధంగా నిధులు కేటాయించి ముదిరాజుల ఆర్థిక అభివృద్ధికి తగు విధమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్రంలోని ముదిరాజ్ సంఘాలతో చర్చించి కార్యచరణ రూపొందించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. స‌మావేశంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుజ్జ నారాయణ ముదిరాజ్ జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మెన లక్ష్మన్న ముదిరాజ్ జిల్లా కార్యదర్శి ఈగల పుచ్చన్న ముదిరాజ్, వన్యబోయిన చిన్నయ్య ముదిరాజ్ ,నాయకులు కొండ వెంకటి కొ ర్రి భూమేష్ కొండ శ్రీకాంత్ మందుల దాసు, మాడవేణి మోహన్, దయ్యాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *