సిరాన్యూస్, బేల
డీఎఫ్ఓను కలిసిన సామ రూపేష్ రెడ్డి
* బాది గ్రామ రైతులకు న్యాయం చేయాలని వినతి
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని బాది గ్రామ రైతులకు న్యాయం చేయాలని ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి మంగళవారం డీఎఫ్ఓ ప్రశాంత్ పాటిల్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ బాది గ్రామ రైతులు గత 25 ఏళ్లుగా అదే గ్రామ శివారంలోని సర్వే నంబర్ 58 లోని అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నా రన్నారు. ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న భూమిని కన్నతల్లిగా భావించి బాది రైతులు ఇదే గ్రామ శివారులోని 58 సర్వే నంబర్ సాగు చేసుకుంటూ పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఈ భూమిలో తమ అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం ద్వారా వారు ఉపాధి కోల్పోవడమే కాకుండా,నిరాశ్రయులుగా మారి తిరిగి కూలి పని చేసుకుని బ్రతికే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు.ఇది ఇలా ఉంటే వీరు సాగు చేసుకుంటున్నా పోడు భూములకు గత ప్రభుత్వం పోడు పట్టాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేక పోయిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పోడు పట్టాలు మంజూరు చేసే దిశగా చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోడు భూములను సాగు చేసుకుంటున్నా రైతుల నుంచి అటవీ శాఖ అధికారులు భూములు తీసుకొని మొక్కలు నాటకుండా, వారు సాగు చేసుకునే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. వీరందరూ కూడా నిరుపేద రైతులే అయినందున వారికి న్యాయం చేయాలని కోరారు. దీనికి స్పందించినా డి.ఎఫ్.ఓ.ప్రశాంత్ పాటిల్ సానుకూలంగా స్పందించగా,రైతులకు తన పూర్తి సహకారం అందిస్తానని అన్నారు.అయితే రైతులు కూడా అటవీ శాఖ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రైతులు వసంతరావు, కొండల వినోద్, మాణిక్ రావు, శాలిక్, విలాస్, కొండల నారాయణ, దీపక్,తదితరులు ఉన్నారు.