సిరాన్యూస్,బేల
సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తాం: యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలంలో గల ఆదివాసీ గ్రామాలలో సమస్యలు పరిష్కరించి ప్రజలకు సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తామని ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి అన్నారు.ఈమేరకు వంజరిగూడ, ఖార,గరకగూడ గ్రామాలను సోమవారం సందర్శించిన ఆయన అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను,కావలసిన సౌకర్యాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ముఖ్యంగా రోడ్డు రవాణా సౌకర్యాలతో పాటు నిత్యవసరాలైన రేషన్ సరుకులు తెచ్చుకోవడానికి స్థానికంగా రేషన్ షాపు లేదని,అర్హులైన వారు ఉన్నప్పటికీ తమ గ్రామాల్లోని పెన్షన్ ఇచ్చే సౌకర్యం లేకపోవడం ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్నారని తెలుసుకున్నారు.ఐతే గడచిన పదేళ్లలో తెలంగాణలోని బి.ఆర్.ఎస్.ప్రభుత్వం విరిని పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని సామ రుపేష్ రెడ్డి ఆరోపించారు. అయితే కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కు వివరించి,ముఖ్యంగా అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు. సామ రూపేష్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే బేలా మండలంలోని మారుమూల, ఆదివాసి గ్రామాలలో ఎక్కడ ఏ సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు తమకు ఎప్పుడు తాను అందుబాటులో ఉంటానని ఆయన భరోసా కల్పించారు. ఇందులో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు,అవినాష్ తదితరులు ఉన్నారు.