Sama Rupesh Reddy: ఖరా గ్రామంలోనే పింఛన్ పంపిణీ : యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి

సిరాన్యూస్,బేల‌
ఖరా గ్రామంలోనే పింఛన్ పంపిణీ : యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి
* ఆదివాసీ గ్రామస్తులకు తిరిన పింఛన్ కష్టాలు

అదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మారుమూల ఆదివాసి గ్రామాలైన ఖార,వంజరి గూడ,గర్కగూడ గ్రామాల్లోని పింఛన్ దార్లు పడుతున్న కష్టాలు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి చోరువతో దూరమయ్యాయి. ప్రతినెల వీళ్లంతా సాత్నాల వాగు దాటి తోయిగూడ గ్రామానికి నడుచుకుంటూ వెళ్లి పింఛను తెచ్చుకునే వారు.వర్షాకాలంలో సాత్నాల వాగు ప్రవహించడంతో 15 కిలో మీటర్ల దూరం నుంచి తిరిగి పింఛన్ కోసం వచ్చేవాళ్ళు ఆయా గ్రామాల ప్రజలు సామ రూపేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అధికారులతో స్పందించారు.తపాల శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి వాళ్ల గ్రామంలో పింఛన్ ఇప్పించేలా ఏర్పాటు చేయాలని కోరారు.శనివారం ఖరా గ్రామంలోనే పింఛన్ పంపిణీ ప్రారంభమైంది.దీంతో ఆయా గ్రామాల ప్రజలు సామ రూపేష్ రెడ్డిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *