సిరా న్యూస్, ఆదిలాబాద్
ధైర్యంగా ఉండండి…
*బాధితుడిని పరామర్శించిన సామ రూపేష్ రెడ్డి
బేల మండలంలోని పోవర్ గ్రామానికి చెందిన మెస్రం గులాబ్ ఐబిపితో మెదడులో బ్లడ్ క్లాట్ అయి అనారోగ్యానికి గురికావడంతో
హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి వెంటనే హైదరాబాద్ చేరుకొని బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న సామ రూపేష్ రెడ్డి ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు.