సిరా న్యూస్, బేల
బస్టాండ్ కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
* మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన యువజన కాంగ్రెస్ నాయకులు
ప్రజల సౌకర్యార్థం కోరకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్న గ్రామంలో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ను కూల్చివేసి ఇల్లు కట్టుకున్న బీఆర్ఎస్ నాయకుడి పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ,బీసీ వెల్ఫేర్ సొసైటీ మంత్రి పొన్నం ప్రభాకర్ ను యువజన అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ప్రయాణ సౌలభ్యం కోసం ఎండ వాన వంటి పరిస్థితులను తట్టుకునేందుకు ఒక బస్టాండ్ ను ఏర్పాటు చేసుకుంటే బేల మండలంలోని సిర్సన్న గ్రామంలో గడచిన పదేళ్లలో తామే అధికారంలో ఉన్నమని టిఆర్ఎస్ నాయకుడు అధికార గర్వంతో బస్టాండ్ ను కూల్చివేసి ఇల్లు కట్టుకుంటున్నాడని అన్నారు.ప్రజలకు మంచి చేయాల్సిన అప్పటి టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒంటెద్దు పోకడతో మాజీ మంత్రి జోగు రామన్న అండతో ఏకంగా ప్రయాణికులకు బస్టాండ్ లేకుండా చేశారని ఆరోపించారు.ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకుడు బస్టాండ్ ని ఏదైతే కూల్చివేసి ఇల్లు కట్టుకుంటున్నాడని ఇదే విషయంపై గతంలో జిల్లా కలెక్టర్ సంబంధిత ఆర్టీసీ అధికారులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకోలేదని ఆరోపించారు.అప్పటి అధికార పార్టీ నాయకులకు జిల్లా కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు వారి అడుగులకు మడుగులొచ్చారని మంత్రికి వివరించారు.అందువలన ఆర్టీసీ బస్టాండ్ ను కుల్చివేసి ఇల్లు కట్టుకుంటున్న కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు.మంత్రిని కలిసిన వారిలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన శ్రీకాంత్ రెడ్డి,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ రావు,మావల మండల అధ్యక్షుడు శేఖర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దామోదర్ రెడ్డి,నవీన్ రెడ్డి,తదితరులు ఉన్నారు.