సిరాన్యూస్, బేల
ఆదివాసీ ఆడబిడ్డను గెలిపిద్దాం..అభివృద్ధి చేసుకుందాం: సామ రూపేష్ రెడ్డి
ఆదివాసీ ఆడబిడ్డను గెలిపిద్దాం..అభివృద్ధి చేసుకుందామని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి అన్నారు.శనివారం అదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో బేల మండలంలోని గణేష్ పూర్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,అర్హులైన నిరుపేదలకు 200 యూనిట్ల విద్యుత్తు,500 రూపాయలకే వంట గ్యాస్,రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద 10 లక్షల ఉచిత వైద్యం ,ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందిస్తుందన్నారు.ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని భరోసా ఇచ్చారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ కష్టపడే నాయకురాలు ఆత్రం సుగుణక్కకు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరారు.ఆయనతో పాటు మాజీ సర్పంచ్ మేస్రం జనార్ధన్,బాపూరావు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజరాం,దత్త,కన్య రాజు,విశాల్ నవీన్ తదితరులు ఉన్నారు.