Sama Rupesh Reddy: బెదోడలో లోవోల్టేజ్ సమస్యను పరిష్కరించండి: సామ రూపేష్ రెడ్డి

సిరాన్యూస్‌, బేల‌
బెదోడలో లోవోల్టేజ్ సమస్యను పరిష్కరించండి: సామ రూపేష్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని బెదోడ గ్రామంలో ఏర్పడిన లో వోల్టేజ్ సమస్యను సత్వరమే పరిష్కరించాలని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రుపేష్ రెడ్డి మండల విద్యుత్ అధికారులకు, లైన్ ఇన్స్పెక్టర్ రమేష్ కు సూచించారు.గత కొన్ని రోజులుగా ఈ సమస్య కొనసాగుతుండడంతో గ్రామ ప్రజలు బుధవారం సమస్యను సామ రుపేష్ రెడ్డి దృష్టికి గ్రామస్తులు తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన సామ రూపేష్ రెడ్డి విద్యుత్ అధికారులను సంప్రదించి స్వయంగా లైన్ ఇన్స్పెక్టర్ రమేష్ తో కలిసి గ్రామానికి వెళ్లి సమస్యకు గల కారణాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. లో వోల్టేజ్ సమస్య లేకుండా అదనంగా ట్రాన్స్ఫార్మర్ వద్ద అదనపు నియంత్రిక ను ఏర్పాటు చేయాలని అధికారులకు తెలియజేశారు.అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు కరెంటు సమస్య లేకుండా చూడాలని సూచించిన విషయం ఆయన గుర్తు చేశారు.ఆ విధంగా ఎప్పటి కప్పుడు కరెంటు సమస్యపై స్పందించి బేల మండలంలో ఉన్న ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.దీనిపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట గ్రామస్తులు దార్నె విజయ్, జీవన్, సురేందర్, సునీల్, గజానన్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *