Sama Rupesh Reddy: మంత్రి సీత‌క్క‌కు.. సామ రూపేష్ రెడ్డి విన‌తి

సిరాన్యూస్‌, బేల‌
మంత్రి సీత‌క్క‌కు.. సామ రూపేష్ రెడ్డి విన‌తి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న కాంట్రాక్టులకు కాకుండా కొత్త కాంట్రాక్టులను నియమించాలని ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి ప్రజా భవన్ లో జిల్లా ఇంచార్జ్ పంచాయతీ రాజ్,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో కాంట్రాక్టర్లు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.గత కొన్ని ఏళ్లుగా కృష్ణ కన్స్ట్రక్షన్స్,మహాలక్ష్మి మాన్ పవర్ ఏజెన్సీ వారే కొనసాగుతున్నారని విరు రిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగ నియామకాల్లో ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వసూలు చేశారని మంత్రికి తెలిపారు.ఉద్యోగం కావాలని వచ్చి అమాయక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఏజెన్సీ ల వల్ల కార్మికులు కూడా చెప్పుకోలేని బాధలతో సతమతమవుతున్నారని అన్నారు. ముఖ్యంగా ప్రతి ఏటా వీరే లోపాయి కారి ఒప్పందం ద్వారా తమ కాంట్రాక్టులను రెన్యూవల్ చేసుకుంటూ వెళుతున్నారని, ఇది కరెక్ట్ కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. కొత్త కాంట్రాక్టులను నియమించే క్రమంలో పత్రికా ప్రకటన ద్వారా బహిర్గతంగా కాంట్రాక్టర్లను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఇంకా అవకాశం కోసం ఎదురుచూసి అనేకమంది నిరుద్యోగులకు కొత్త కాంట్రాక్టర్ల ద్వారా ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. అందుకు వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న కృష్ణ కన్స్ట్రక్షన్స్ తో పాటు మహాలక్ష్మి మాన్ పవర్ ఏజెన్సీ వారిని తొలగించాలని, కిట్స్ టెండర్లు, బ్లడ్ బ్యాంక్ టెండర్, ఆరోగ్యశ్రీ ఇంప్లాంట్స్ టెండర్ కుడా వేయడం లేదని అన్నారు. వీరి స్థానంలో కొత్తవారిని నియమించాలని మంత్రిని కోరడం జరిగిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *