సిరా న్యూస్, ఆదిలాబాద్:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
– తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పడాల రవీందర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పడాల రవీందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ పాఠశాలలో సంఘం జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా భవిష్యత్ కార్యాచరణ, నూతన బాడి ఎన్నిక తదితర అంశాల గురించి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని, అప్పటిలోగా కనీసం బేసిక్ పే అందరికి కల్పించాలని పేర్కొన్నారు. జీవిత బీమా రూ.50 లక్షల కల్పించడంతో పాటు ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు రుధ్రవేణి వెంకటి, ప్రధాన కార్యదర్శి రామెల్లి ప్రకాష్లు మాట్లాడుతూ సంఘం కోసం సమగ్ర శిక్షా ఉద్యోగులందరు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు రాకేష్, దేవదర్షన్, విష్ణు, చిరంజీవి, నాగ్నాథ్, భాను, జావిద్, రాజేశ్వర్, సురేష్, శ్రీలత గణేష్, తదితరులు పాల్గొన్నారు.