సిరా న్యూస్, భీమదేవరపల్లి
చల్లంగా చూడమ్మా సమ్మక్క సారక్క
* మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
ఆసియా ఖండం లోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన శ్రీ మేడారం సమ్మక్క సారక్క వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించడం ప్రారంభించారు. శనివారం భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్, కొత్తకొండ గ్రామాల్లో వెలిసిన సమ్మక్క సారక్క దేవతలను భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకుంటారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు అమ్మవార్లకు మొక్కులను మొక్కిన విధంగా ఎత్తు బంగారం సమర్పిస్తున్నారు. ఈనెల 21, 22, 23 తేదీలలో అమ్మవారుల రూపంతో కోయ పూజారులు గద్దెలకు ప్రాణం పోస్తారు..మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన ముల్కనూర్ సమ్మక్క సారక్క అమ్మవారుల దర్శనార్ధం దాదాపు లక్ష మందికి పైగా హాజరైతారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా అధికారులు ఏర్పాట్లు చేశారు..