సిరాన్యూస్, కోహెడ:
చలివేంద్రం ప్రారంభించిన ఎన్ఎస్యూఐ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు సనత్ రెడ్డి
]సిద్దిపేట్ జిల్లా కోహెడ మండలంలోని తీగలగుంటపల్లి గ్రామంలో చలివేంద్రాన్ని గురువారం ఎన్ఎస్యూఐ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు సనత్ రెడ్డి ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో గ్రామ ప్రజలకు ,అలాగే రోడ్డుపై ప్రయాణించే వారికి దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలోఎన్ఎస్యూఐ కోహెడ మండల అధ్యక్షుడు రంజిత్ రెడ్డి, సభ్యులు కార్తీక్, ఆదిత్య, ప్రశాంత్, వివేక్, అంజి, కిషోర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.