మంత్రి సీతక్క
సిరా న్యూస్,ములుగు;
ఇసుక లారీలను నియంత్రించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అధిక లోడు వచ్చే లారీలతో రోడ్లు మొత్తం గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. మేడారం జాతర దృశ్యా ఇసుక లారీల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఓవర్ లోడ్ తో వచ్చే లారీలను అనుమతించకుండా అధికారులు చర్యలు తీసుకోండి. మేడారం జాతర పనుల విషయములో అలసత్వం వహిస్తే సహించేది లేదని అన్నారు. అధికారులను అయితే ఇంటికి…కాంట్రాక్టర్లు అయితే బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తారు మంత్రి హెచ్చరించారు.