Sandhya Harinath: ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చిన సర్పంచ్

సిరా న్యూస్, కుందుర్పి
ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చిన సర్పంచ్
కంబదూరు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో హరిజన వాడలో గత 20 సంవత్సరాల క్రితం ప్రజోపయోగ దృష్ట్యా బోరు వేయించారు. అయితే ఆ బోరులో వస్తున్న నీరు కాలక్రమేణా భూగర్భజలాలు అడుగంటడంతో ఆగిపోయింది. ఎండాకాలం ముంచుకొస్తున్న తరుణంలో ఆ కాలనీవాసులకు నీటి సమస్య జఠిలం త‌యారైంది. ఇంతవరకు త్రీ పేస్ సర్వీస్ తో ఉన్న ఆ బోరుకు సింగిల్ ఫేస్ మోటార్ అమర్చి నీరు బయటికి తీసుకుని రావడానికి ఆ గ్రామ సర్పంచి ఆసాది సంధ్యా హారినాథ్ సహాకారంతో ఆ గ్రామ యువకులు ప్రయత్నించారు. అయితే నీరు బయటికి వచ్చేశాయి. దీంతోఆ కాలనీ వాసులకు తీవ్రంగా ఉన్న నీటి సమస్య కొంత తొలగిపోయి ఉపశమనం కల్గినట్లైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *