సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఉగాది పురస్కారాలకు ఆహ్వానితులుగా సంగెం సుధీర్ కుమార్
+ న్యాయవాది సుధీర్ కుమార్కు ఆహ్వానం పలికిన నిర్వహకులు
+ తన అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించిన సుధీర్ కుమార్
+ జిల్లా వాసుల నుండి వెల్లువెత్తుతున్న అభినందనలు
ప్రముఖ న్యాయవాది, సంగెం ట్రస్ట్ చైర్మెన్, గాయకుడు సంగెం సుధీర్ కుమార్ జీవితంలో మరో మైలురాయిని సాధించారు. ప్రతీ ఏట ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఉగాది విశిష్ఠి పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయన ఆహ్వానం అందుకున్నారు. మెగాసిటీ నవకళ వేధిక ఆధ్వర్యంలో హైదరబాద్లోని రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్ లో ఈ నెల 8న నిర్వహించనున్న ఉగాది పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి ఈ మేరకు ఆయన హాజరు కానున్నారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ బండ ప్రకాష్, తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్ రావులు ముఖ్య అతిథులుగా, దైవజ్ఞ శర్మ సభాధ్యక్షులుగా వ్యవహరించనున్న ఈ కార్యక్రమానికి హాజరు కావడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు న్యాయవాది సంగెం సుధీర్ కుమార్ తెలిపారు. కాగా ఉగాది పురస్కారాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా వెళ్లనుండటంతో ఆయనకు జిల్లా వాసుల నుండి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని మారుమూల గ్రామమైన అడెగామా గ్రామం నుండి వచ్చిన తనకు ఇలాంటి గొప్ప అవకాశాలు దక్కడం తన తల్లిదండ్రుల ఆశీస్సులు, తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన ‘సిరా న్యూస్’ కు తెలిపారు. మహామహులతో కలిసి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉగాది పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కడం తనపై మరింత బాధ్యతను పెంచిందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో సంగెం ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి, నిరుపేదలకు బాసటగా నిలుస్తానని ఆయన తెలిపారు.