Sangem Charitable Trust: సంగెం ట్రస్ట్ సేవలు అభినందనీయం…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

సంగెం ట్రస్ట్ సేవలు అభినందనీయం…

+ ప్రముఖ సినీ తార జ్యోతీశ్వరి

సంగెం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలు చాలా అభినందనీయమని ప్రముఖ సినీ తార జ్యోతీశ్వరి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన ఉచిత అన్నదాన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద్భంగా స్వయంగా తన చేతులతో పలువురికి అన్నదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… నిరుపేదల ఆకలి తీర్చాలననే గొప్ప సంకల్పంతో గత 151 వారాలుగా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగెం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్ ను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సుధీర్ కుమార్ సంగెం, మహేందర్ రెడ్డి, సలీమ్, శుభాష్, అంబయ్య, దత్తు, రాకేష్, శేఖర్, లఖన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *