సిరా న్యూస్, బేల
ఛత్రపతి శివాజీని శౌర్యానికి ప్రతీక
* సాంగిడి యూత్ సభ్యులు
ఛత్రపతి శివాజీని శౌర్యానికి ప్రతీక అని సాంగిడి యూత్ సభ్యులు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని సాంగిడీ గ్రామంలో సోమవారం సాంగిడీ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీని జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 17 ఏళ్ల చిరు ప్రయాణంలోనే యుద్ధం చేసి కోటలను గెలుస్తూ మొఘల్ సామ్రాజ్యం ఎదిరించి వారి దుర్ఘాతాలకు చర్మగీతం పాడి భారత దేశంలో మరాఠ సామ్రాజ్యాన్ని స్థాపించారన్నారు. వారు సాధించిన అనేక పోరాటాల నుండి స్ఫూర్తి పొందుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో అక్షయ్ నౌఘరే, ప్రాజూత్ మాలేకర్, అంకిత్ నౌఘరే, దత్తు గౌడ్ , నీఖిల్, ప్రీతమ్ ప్రపూల్ గౌడ్, పెద్దలు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.