సిరా న్యూస్, భీమదేవరపల్లి:
అస్తవ్యస్తంగా పారిశుధ్య నిర్వహణ
*కానరాని స్పెషల్ డ్రైవ్
*ఇబ్బందుల్లో రసూల్ పల్లి గ్రామస్తులు
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మరింత అస్తవ్యస్తంగా మారింది. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్నిపారిశుధ్యం మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. నిర్వహణలో లోపాల వల్ల అసలుకే ఎసరు అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉండడం వంటి కారణాల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కానీ మారుమూల పల్లె కదా.. మా గ్రామానికి ఎవరు వస్తారు లే అనుకున్నారో ఏమో.. గ్రామంలో పారిశుద్ధ్యం పట్టించుకోవడం బొద్దిగా మానేశారు.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్ పల్లి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈనెల ఏడు నుండి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ రసూల్ పల్లి గ్రామంలో మాత్రం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం కంటికి కానరాకుండా పోయింది.. గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపిడిఓ భాస్కర్ రెండు రోజుల క్రితం బదిలీ కావడంతో పారిశుద్ధ పనులు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి.. పేరుకే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించి దాని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేయకపోవడం పై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.