సిరా న్యూస్, గొల్లప్రోలు:
పారిశుధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలి..
కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమ్మె గురువారం నాటికి రెండో రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మోకాళ్లపై నుంచుని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు కే.విశ్వనాథం, అంగన్వాడి వర్కర్స్ గొల్లప్రోలు మండల నాయకులు బి.తులసీదేవి, అమల, యుటిఎఫ్ సంఘం నాయకులు సీత రామరాజు, డి. పద్మనాభం మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ప్రభుత్వం ప్రతి కార్మికుడికి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం తో పాటు, వారికి పండగ సెలవులు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్, సిఐటియు సభ్యులను చర్చలకు పిలిచి, వీరి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శానిటేషన్ వర్కర్స్ నాయకులు నీలాపు ఏసమ్మ, సిహెచ్ వి రమణ, పోలమ్మ, సత్తిబాబు రామారావు, సతీష్, లోవబాబు, మరిడియ్య, తదితరులు పాల్గొన్నారు.